అనంతపురం జిల్లా లోని మడకశిర పర్యటనలో భాగంగా బెంగుళూరు విమానాశ్రయం నుండి కోడికొండ చెక్ పోస్టు చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం లభించింది. లోకేష్ జిల్లా, నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున ఘన స్వాగతం పలికారు. అంతకుముందు బెంగళూరు విమానాశ్రయం వద్ద మంత్రి లోకేష్ను మంత్రి కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్యే బీకె పార్థసారథి, జెడ్పీ చైర్మన్ పూల నాగరాజు, చంద్రదండు అధ్యక్షుడు ప్రకాష్ నాయుడులు కలిసి స్వాగతం పలికారు. కోడికొండ సమీపంలో హిందూపురం నాయకులు అంబికా లక్ష్మీనారాయణ, జేఇ వెంకటస్వామి, మున్సిపల్ వైస్ చైర్మన్ రోషన్ అలీ, చిలమత్తూరు నాయకులు అన్సర్ అహమ్మద్, రాష్ట్ర కార్యదర్శి అంజినప్ప, కన్వీనర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు మంత్రి లోకేష్ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా అంబికాతో మంత్రి ప్రత్యేకంగా కొద్దీ నిమిషాలు మాట్లాడారు. మడకశిర నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను అయన ప్రారంభించారు.