తెలంగాణ కాంగ్రెస్లో తలెత్తిన అంతర్గత కుమ్ములాటలు.. పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. బస్సు యాత్రతో హడావుడి చేసిన పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి మొదట్లో బాగానే సాగింది. పైగా కండువాలు కప్పుకునేందుకూ పోటీపడిన సంఘటనలూ కనిపించాయి. దీంతో గులాబీ పార్టీపై పై చేయి సాధించేందుకు ఇక తమకు తిరుగులేదనే ధీమాకు వచ్చారు. అయితే.. ఈ క్రెడిట్ అంతా.. ఉత్తమ్ఖాతాలో పడితే.. అమ్మో ఇంకేమైనా ఉందా! అనే ఆలోచన కూడా పార్టీ సీనియర్లలో తలెత్తినట్టుంది. ఇప్పటి వరకూ మనసులో వున్న ఆక్కసును వెళ్లగక్కుతూ బయటపడుతూ పార్టీ పరువు చేతులారా బజార్న పడేలా చేస్తున్నారు. జయపాల్రెడ్డి, కోమటిరెడ్డి, సంపత్కుమార్ వంటి వాళ్లు.. ఆచితూచి అడుగులేస్తుంటే.. సీనియర్లు మాత్రం బయటపడుతూ.. తమ స్థానం పై నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు. డీకే అరుణ కు.. నాగం జనార్దన్ రెడ్డి హస్తం పార్టీలోకి రావటం సుతరాం ఇష్టం లేనట్టుంది. అందుకే.. హైకమాండ్పై నోరెత్తలేక.. ఉన్న నేతలపై మండిపడుతున్నారు. మరో ఎమ్మెల్సీ అయితే. గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధపడ్డారు. రేవంత్రెడ్డి ఇటీవల టీడీపీతో కాంగ్రెస్ పొత్తు గురించి మాట్లాడటం..అదే సమయంలో టీడీపీలోని లోపాలు.. చంద్రబాబుపై మోత్కుపల్లి కామెంట్స్ చేయటంతో.. ఇక టీడీపీ తెలంగాణలో నెగ్గాలంటే కాంగ్రెస్తో దోస్తీ పక్కా అనే నిర్ణయానికి వచ్చారు. అయితే.. ఏపీలో మంత్రి కేఈ కృష్ణమూర్తి.. టీడీపీ.. హస్తంతో పొత్తుపెట్టుకుంటే ఉరేసుకుంటానంటూ తెగేసి చెప్పారు. ఇటువంటి విపత్కర సమయంలో ఉన్న నేతలు.. పక్కపార్టీలోకి జంప్ చేయటం.. ఇంకొందరు అంతర్గత కుమ్ములాటలతో బజారుకు ఎక్కటం.. పార్టీను ఇబ్బంది పెడుతున్నాయట. అందుకే.. యువరాజు.. సారీ కాబోయే ప్రధానమంత్రి రాహుల్గాంధీను తెలంగాణా ఆహ్వానించి.. ఆయన ఎదుటే.. కలసివుంటే కలదు సుఖమనే ఆశీర్వాదం తీసుకో్వాలని ఉత్తమ్ ప్లాన్ చేస్తున్నాడట. అయితే.. అంత వరకూ అంతర్గత కలహాలతో ఎవరు పార్టీలో ఉంటారు.. ఎవరు వీడతారనేది మాత్రం ఎలా ఆపగలమంటూ పార్టీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి