YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కొత్త ఉగాది తో కొత్త ఆశలు:

కొత్త ఉగాది తో కొత్త ఆశలు:

తెలంగాణ రాష్ట్రంలో ఉగాది పండుగ కొత్త నందన సంవత్సరం సందర్బంగా ముఖ్యమైన ప్రజా సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డ్ కలిగిన ప్రతి ఒక్కరికి సన్న బియ్యం పంపిణీ చేసే నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం నిరుపేదలకు నాణ్యమైన ఆహారం అందించడమే కాకుండా రేషన్ సరఫరాలో అవకతవకలను అడ్డుకునేందుకు కూడా దోహదపడనుంది.
హుజూర్ నగర్ నుండి ప్రారంభం:
ఈ సంక్షేమ కార్యక్రమాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి  ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వంత నియోజకవర్గం హుజుర్ నగర్‌లో ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు , ఇతర మంత్రులు హాజరుకానున్నారు. రాష్ట్ర స్థాయిలో ఎంతోమంది ప్రజలు ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
పేద ప్రజల ఎదురు చూపులకు తెరపడింది
ఎన్నో ఏళ్లుగా రాష్ట్రంలోని ప్రజలు, ముఖ్యంగా నిరుపేదలు, సన్న బియ్యం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ బియ్యం నాణ్యతకు ప్రసిద్ధి చెందిందని, తక్కువ ధరలో అత్యుత్తమ ఆహారంగా ఉపయోగపడుతుందని ప్రజలు నమ్ముతున్నారు. తెలంగాణ ప్రభుత్వం వారి కోరికను నెరవేర్చుతూ ఉగాది పండుగ సందర్భంగా సన్న బియ్యం పంపిణీని ప్రారంభించడం ప్రజల్లో ఆనందాన్ని కలిగించింది.
అవినీతికి అడ్డుకట్ట
రేషన్ పంపిణీ వ్యవస్థలో పలు ఇబ్బందులు, అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. రేషన్ సరుకులను అక్రమంగా వాడుకోవడం, నాణ్యతలో లోపాలు వంటి సమస్యలు ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టాయి. కానీ ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ద్వారా అలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రజా ప్రభుత్వానికి కృతజ్ఞతలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి కి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు కి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి  ఉత్తంకుమార్ రెడ్డి కి ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. వారు తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రంలోని నిరుపేదల ఆహార భద్రతను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించనుంది.
ప్రజల హితంలో ముందుకు
సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత మేలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించుకుంది. సన్న బియ్యం పంపిణీతో పాటు, ఇతర పౌరసరఫరాల మెరుగుదల కోసం మరిన్ని చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆశిస్తున్నారు. ఈ విధంగా, ప్రతి ఒక్కరికీ నాణ్యమైన ఆహారం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నందుకు రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా అభినందనీయమైనదే. ఇది రేషన్ సద్వినియోగాన్ని పెంపొందించి, లబ్ధిదారులకు నిస్వార్థంగా సహాయం చేసే ఒక పెద్ద ముందడుగు.

Related Posts