YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అవినీతిని నిరూపించండి : ఎంపీ కేశినేని నాని

అవినీతిని నిరూపించండి :   ఎంపీ కేశినేని నాని
కేంద్ర ప్రభుత్వం,  బీజేపీ,  ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని పచ్చి మోసం చేశాయి. ఎంపీ జీవియల్ నరసింహారావు ఆంధ్రప్రదేశ్ కు సహాయం చేస్తామని చెప్పడంతో సంతోషించాం. కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టడం కుదరదని కోర్టులో కేస్ ఫైల్ చేసి మరోసారి మోసం చేసిందని ఎంపీ కేశీనేని నాని అన్నారు. గురువారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. నికాన్ సంస్థ నివేదిక ఇచ్చిన ఆధారంగా కడపలో స్టీల్ ప్లాంట్ పెడతామని కేంద్రం హామీ ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం తరపున సహకరిస్తామని చంద్రబాబు చెప్పారు. కడప స్టీల్ ప్లాంట్ కుదరదని కేంద్రం చెప్పినా బీజేపీ ని ప్రశ్నించకుండా కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నడని విమర్శించారు. ఎంపీ ల రాజీనామాల విషయంలో డ్రామాలు ఆడావ్. ఎన్నికలు రావని తెలిసి కూడా రాజీనామాల డ్రామా ఆడిస్తున్నావ్. డ్రామాలు ఇప్పటికైనా ఆపి పార్లమెంట్లో టీడీపీ తో కలిసి కేంద్రం పై పోరాడాలి. 9 నెలల్లో ఎన్నికలు రానున్నాయి. బీజేపీ కి చిత్త శుద్ధి ఉంటే రైల్వే జోన్,స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని అయన అన్నారు. అంతకుముందు విభజన హామీలు నెరవేర్చాలి. పోలవరం పనులు  శరవేగంగా జరుగుతుంటే జరగడంలేదని బీజేపీ, జగన్ విమర్శలు చేస్తున్నారు. ప్రధాని మోడీ కోటి ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు పోతున్నాయని అయన వ్యాఖ్యానించారు.  దేశంలో అవినీతి పెరిగింది. బీజేపీ పాలనలో మోసాలు పెరిగాయి. ప్రజలకు బ్యాంకింగ్ వ్యవస్థ పై నమ్మకం పొయింది. పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగాయి. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వ్యవస్థలను నిర్వీర్యం చేశారని అన్నారు. చంద్రబాబు అవినీతి చేశారని దమ్ముంటే నిరూపించాలని డిమాండ్ చేసారు.

Related Posts