
హైదరాబాద్, ఏప్రిల్ 1,
హెచ్ సీఏ వర్సెస్ ఎస్ ఆర్ హెచ్. ఇది క్రికెట్ అభిమానులకు కాస్త కష్టంగా ఉండొచ్చు కానీ.. రియాల్టీలో మాత్రం ఇదే జరుగోతంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ – సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య ఫ్రీపాస్ విషయంలో పెద్ద ఎత్తున వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. అసలు వివాదమేంటో చూస్తే.. హెచ్ సీఏ అధికారులు ఉచిత టికెట్ల కోసం బెదిరింపులు, ఒత్తిడి చేస్తున్నారని, గత రెండేళ్లుగా ఈ సమస్యలు కొనసాగుతున్నాయని ఎస్ ఆర్ హెచ్ ఆరోపిస్తోంది. మార్చిన 27న కూడా గొడవ జరిగినట్లు తెలుస్తోంది. లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో కూడా హెచ్ సీఏ ఫ్రీపాస్ల విషయంలో గొడవ చేసిందని.. మ్యాచ్కు ముందు ఒక కార్పొరేట్ బాక్స్ను హెచ్ సీఏతాళం వేసిందని, అదనపు టికెట్లు ఇవ్వకపోతే తెరవమని బెదిరించిందని ఎస్ ఆర్ హెచ్ ఆరోపిస్తోంది. ఇలాంటి గొడవలు కంటిన్యూ అయితే.. తమ హోమ్గ్రౌండ్ను వేరే వేదికకు తరలిస్తామని ఎస్ ఆర్ హెచ్ వార్నింగ్ ఇస్తోంది. ఈమేరకు హెచ్ సీఏ కు మెయిల్ కూడా పంపినట్లు సమాచారం. అలాగే తెలంగాణ ప్రభుత్వానికి, బీసీసీఐకు కూడా ఫిర్యాదు చేస్తామని ఆ మెయిల్లో ఎస్ ఆర్ హెచ్ హెచ్చరించినట్లు వార్తలొచ్చాయి.కానీ హెచ్ సీఏ వెర్షన్ మరోలా ఉంది. అసలు ఫ్రీపాస్ల విషయంలో తామెవరినీ బెదిరించలేదని.. ఎస్ ఆర్ హెచ్ నుంచి ఎలాంటి అధికారిక ఈ-మెయిల్ రాలేదని, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదంటోంది. అసలు ఈ-మెయిల్ నిజంగా లీక్ అయిందా? లేక ఎస్ ఆర్ హెచ్ దీన్ని బహిర్గతం చేసి హెచ్ సీఏ పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసిందా? అన్న ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. అయితే ఇవన్నీ ఫేక్ మెయిల్స్ అన్నది హెచ్ సీఏ వాదన. మామూలుగా హెచ్ సీఏ తో ఒప్పందం ప్రకారం స్టేడియం సామర్థ్యంలో 10%.. అంటే సుమారు 3,900 టికెట్లు ఉచితంగా ఇస్తున్నారు. ఇందులో F12A కార్పొరేట్ బాక్స్లో 50 సీట్లు ఉన్నాయి. కానీ ఈ సీజన్లో ఆ బాక్స్ సామర్థ్యం 30 సీట్లేనని, అదనంగా 20 సీట్లు మరో బాక్స్లో ఇవ్వాలని కోరింది.ఎస్ ఆర్ హెచ్ ఈ అదనపు డిమాండ్ను నిరాకరించడంతో, హెచ్ సీఏ మార్చి 27న లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్ రోజున F3 బాక్స్ను తాళం వేసిందని, అదనపు టికెట్లు ఇవ్వకపోతే తెరవమని బెదిరించిందని ఎస్ ఆర్ హెచ్ ఆరోపిస్తోంది. గత రెండేళ్లుగా ఇలాంటి సమస్యలు కొనసాగుతున్నాయని, ఇక సహించలేమని ఎస్ ఆర్ హెచ్. హెచ్ సీఏ ట్రెజరీకి మెయిల్ చేసిందన్నవార్తలు వచ్చాయి.నిజంగా ఎస్ ఆర్ హెచ్ ఆరోపణల్లో వాస్తముండి..హెచ్ సీఏ టార్చర్ పెడుతుంటే.. ఎస్ ఆర్ హెచ్ హోమ్గ్రౌండ్ను వీడే అవకాశం ఉంది. ఇదే జరిగితే.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కు పెద్ద దెబ్బ. ఇది కేవలం క్రికెట్ సమస్యగానే కాదు..హైదరాబాద్ ఇమేజ్పైనా ప్రభావం ఉండే అవకాశం ఉంది. IPL జట్టును కోల్పోవడం అంటే అటు ప్రభుత్వానికి.. హెచ్ సీఏ సామర్థ్యానికి పెద్ద తలవొంపే. IT హబ్గా పేరున్న హైదరాబాద్కు ఇది బిగ్ బ్లండర్ మెస్టేక్. ఎస్ ఆర్ హెచ్ ఈ విషయాన్ని బీసీసీఐ తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పింది. బోర్డు జోక్యం చేసుకుంటే, హెచ్ సీఏ పై కఠిన చర్యలు తీసుకోవచ్చు. లేకపోతే ఎస్ ఆర్ హెచ్ కి తాత్కాలికంగా విశాఖపట్నం వంటి వేరే వేదికను కేటాయించవచ్చు.అందుకే తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఎస్ ఆర్ హెచ్ కు మద్దతుగాహెచ్ సీఏ కు వార్నింగ్ ఇచ్చారు. ఫ్రీ పాసుల విషయంలో సన్ రైజర్స్ను ఇబ్బంది పెడితే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హెచ్ సీఏ పై వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ సర్కార్ సీరియస్ కావడంతో.. హెచ్ సీఏ ఓ సుదీర్ఘ వివరణ ఇచ్చింది. హెచ్ సీఏ పై గతంలోనూ అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. విద్యుత్ బిల్లుల విషయంలోనూ వివాదాల్లో చిక్కుకుంది. ఇప్పుడు ఫ్రీపాస్ వివాదం. మరి ఈ వివాదం ఎటు తిరిగి ఎటు పోతుందోనన్న ఆందోళన అటు క్రికెట్ అభిమానుల్లో కనిపిస్తోంది. మరి చూడాలి..ఇష్యూ చినిగి చాటవకుండా..నాలుగు గోడలమధ్యే పరిష్కారమవుతుందా.. అన్నది.