
హైదరాబాద్, ఏప్రిల్ 1,
తెలంగాణలో పేదల కడుపు నింపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకంపై రాజకీయ వివాదం రేగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా హుజూర్నగర్లో ప్రారంభించారు. ‘పేదలు కూడా శ్రీమంతుల్లా సన్న బియ్యం తినాలనే ఆలోచనతో ఈ పథకం తెచ్చామని‘ ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలోనే రేషన్ షాపుల విధానం, బియ్యం సరఫరా పథకాలు మొదలయ్యాయని, గతంలో సీఎం కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి) రూ.90 పైసలకే కిలో బియ్యం ఇచ్చారని రేవంత్ గుర్తు చేశారు. ఈ పథకం చరిత్రలో నిలిచిపోతుందని, భవిష్యత్లో ఎవరు అధికారంలోకి వచ్చినా దీన్ని కొనసాగించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన సన్నబియ్యం పంపిణీ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హుజూర్నగర్లో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన సీఎం రేవంత్.. శ్రీమంతుల తరహాలో పేదలు కూడా సన్నబియ్యం తినాలనే ఆలోచనతోనే ఈ పథకాన్ని తీసుకొచ్చామని తెలిపారు. ఎన్టీఆర్ కంటే ముందు కాంగ్రెస్ సీఎం కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి పేదలకు రూపాయి 90 పైసలకే కిలో బియ్యం ఇచ్చే పథకాన్ని ప్రారంభించారన్నారు సీఎం రేవంత్. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ ఈ పథకాన్ని కొనసాగించారని తెలిపారు. తాము తీసుకొచ్చిన సన్న బియ్యం పథకం చరిత్రలో నిలిచిపోతుందని.. చరిత్రలో ఎవరు సీఎం అయినా ఈ పథకం కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు సీఎం రేవంత్. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పేదల కోసమే ఆలోచిస్తుందని.. అందుకే వారి ఆకలి తీర్చేందుకు ఈ పథకం తెచ్చామని సీఎం రేవంత్ తెలిపారు. సోనియాగాంధీ ఆహార భద్రతా చట్టం తీసుకొచ్చేందుకు ఎంతో కృషి చేశారని కామెంట్ చేశారు.అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సన్నబియ్యం పథకంలోని మెజార్టీ ఖర్చు భరిస్తోంది కేంద్రమే అన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. ఒక్కో కిలోకు రూ.40లు కేంద్రం చెల్లిస్తోందన్నారు. సన్న బియ్యం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై కిలోకు పడే భారం 10 మాత్రమేనన్నారు. రేషన్ షాపుల్లో కనీసం మోదీ ఫోటో కూడా పెట్టడం లేదన్నారు. పేదల ఆకలి తీర్చేందుకు కేంద్రం ఎంత ఖర్చు చేస్తోంది.. రాష్ట్రం ఎంత ఇస్తోందనే విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.పేదలకు బియ్యం పంపిణీ సహా ఇప్పుడు సన్న బియ్యం పంపిణీ వరకు అన్ని పథకాలు కాంగ్రెస్ హయాంలోనే మొదలయ్యాయని కాంగ్రెస్ చెబుతుంటే.. ఈ పథకం అమలు కోసం కేంద్రమే ఎక్కువ ఖర్చు చేస్తోందని బీజేపీ అప్పుడే కౌంటర్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. దీంతో రాబోయే రోజుల్లో ఈ అంశంపై రెండు పార్టీల మధ్య మరింతగా మాటల యుద్ధం కొనసాగే అవకాశం ఉందనే చర్చ మొదలైంది.సోనియా గాంధీఆహార భద్రతా చట్టం కోసం చేసిన కృషిని కూడా ఆయన కొనియాడారు.అయితే, ఈ పథకం క్రెడిట్ను కాంగ్రెస్ తీసుకోవాలని చూస్తుండగా, బీజేపీ దీనికి కౌంటర్ ఇచ్చింది. కేంద్రమంత్రి బండి సంజయ్ ‘సన్న బియ్యం పథకంలో ఎక్కువ ఖర్చు కేంద్రమే భరిస్తోంది. కిలోకు రూ.40 కేంద్రం ఇస్తుండగా, రాష్ట్ర భారం కేవలం రూ.10 మాత్రమే‘ అని పేర్కొన్నారు. రేషన్ షాపుల్లో ప్రధాని మోదీఫోటో కూడా పెట్టడం లేదని, పేదల కోసం కేంద్రం చేస్తున్న ఖర్చును ప్రజలు గమనించాలని ఆయన కోరారు. ఈ వాదనతో బీజేపీ పథకంలో తమ వాటా ఎక్కువగా ఉందని నొక్కి చెబుతోంది. కాంగ్రెస్ మాత్రం, బియ్యం పంపిణీ నుంచి సన్న బియ్యం వరకు అన్ని పథకాలు తమ హయాంలోనే మొదలయ్యాయని, పేదల ఆకలి తీర్చడం తమ లక్ష్యమని చెబుతోంది. దీంతో ఈ అంశంపై రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ వివాదం మరింత రాజకీయ రంగు పులుముకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.మంగళవారం నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ ప్రారంభించారు. వానాకాలంలో కొనుగోలు చేసిన సన్న వడ్లను సీఎంఆర్ కింద మిల్లులకు ఇచ్చిన ప్రభుత్వం, అందులో సగం బియ్యాన్ని జిల్లా గోదాములకు తరలించింది. ఏప్రిల్ కోటా కోసం ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ షాపులకు సరఫరా ఇప్పటికే మొదలైంది.