తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థలో హరితహారం పై అటవీ, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష
జరిపారు. ఈ భేటీకి అటవీ శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ శర్మ, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్, సెర్ప్ సీఈఓ పౌసమి బసు, ప్రిన్సిపల్ కన్సర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ పీకే ఝా హజరయ్యారు. గ్రామాల్లో నర్సరీల ఏర్పాటు, రోడ్ల ప్రక్కన ముళ్ల పొదల తొలగింపులపై కుడా సమీక్ష జరిపారు. ప్రతి గ్రామంలో కనీసం 20 వేల నుండి లక్ష మొక్కలతో నర్సరీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.