
హైదరాబాద్
హైదరాబాద్ కు బ్రాండ్ గా ఉన్న చార్మినార్ వద్ద పెనుప్రమాదం తప్పింది. నగరంలో పడిన భారీ వర్షానికి భాగ్యలక్ష్మి ఆలయం వైపున చార్మినార్ నుంచి పెచ్చులు వుడి పడ్డాయి. దీంతో పర్యాటకులు భయాందోళనకు గురై, పరుగులు తీశారు. గతంలో రిపేర్ చేసిన చార్మినార్ నుంచి పెచ్చులు ఉడిపడినట్లు నిర్దారణ అయింది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఊడిపోయిన పెచ్చులను తీసి వేసి అక్కడ క్లీన్ చేశారు. పెచ్చులు ఉడిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని తెలిపారు. చార్మినార్ కు మరోమారు మరమ్మతులు చేస్తామని పేర్కొన్నారు.
హైదరాబాద్ లో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములతో,మెరుపులతో భారీగా వర్షం కురిసింది. దీంతో రోడ్లపై నీరు ఏరులై పారుతోంది హైదరాబాద్ లో భారీ వర్షం కారణంగా రోడ్లు నీట మునిగాయి.