YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కేసీఆర్ వి శిఖండి రాజకీయాలు: నారాయణ

కేసీఆర్ వి శిఖండి రాజకీయాలు: నారాయణ
బీజేపీ పతనం ప్రారంభమయిందని, రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి తథ్యమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ జోస్యం చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయాల్లో శిఖండి పాత్రను పోషిస్తున్నారని నారాయన దుయ్యబట్టారు. ఫెడరల్ ఫ్రంట్ అనేది ఎన్డీయేకు బీ-ఫ్రంట్ లాంటిదని అన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని... కేసీఆర్ కు దమ్ముంటే కేంద్రంపై పోరాడాలని సవాల్ విసిరారు. బాంచెన్ దొర అంటూ కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాళ్ల వద్ద మోకరిల్లుతున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతోందని... తెలంగాణను వ్యతిరేకించిన వారంతా ఇప్పుడు కేబినెట్ లో ఉన్నారని విమర్శించారు. బీజేపీ పతనమవుతుందని చెప్పడానికి నిదర్శనం ఇటీవల జరిగిన ఉప ఎన్నికలే అని అన్నారు. పునర్వైభవం కోసం బీజేపీ నేతలు నానా కష్టాలు పడుతున్నారని, చివరకు హీరోయిన్ మాధురీ దీక్షిత్ సహకారాన్ని కూడా కోరారని ఎద్దేవా చేశారు.. బీజేపీకి మిత్ర పక్షాలు దూరమవుతున్నాయని తెలిపారు. ‘పూర్వ వైభవం కోసం సినీ నటి మాధురీదీక్షిత్‌ లాంటి వారి సహకారాన్ని కోరడం ద్వారా రానున్న ఎన్నికల్లో ఓటమి తథ్యమని నిరూపించుకున్నారు. ఆర్‌ఎస్ఎస్ సమావేశానికి చివరి నిమిషంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ వెళ్లడం అవకాశవాదమే. ప్రభుత్వం వల్లే ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడుతోంది. బీజేపీకి వ్యతిరేకంగా లౌకిక శక్తులన్నింటిని సీపీఐ ఏకం చేస్తుంద’ని నారాయణ తెలిపారు.

Related Posts