
హైదరాబాద్, ఏప్రిల్ 5,
ఈసారి కచ్చితంగా జరుగుతుంది అనుకున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ మళ్లీ వాయిదా పడిపోయింది.. డైలీ సిరియల్ లా వ్యవహారంనడుస్తోవది. కొత్త మంత్రుల ఎంపిక విషయంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నెల 3న విస్తరణ జరుగుతుందని అందరూ ఊహించినప్పటికీ, చివరి నిమిషంలో ఢిల్లీ నుంచి కొత్త ట్విస్ట్లు తెరపైకి వచ్చాయి. మంత్రుల జాబితా ఖరారైనట్లు పార్టీ ముఖ్య నేతలు భావించినా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ కొన్ని పేర్లపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో పరిస్థితి మారింది. దీంతో, కొత్త జాబితా కోసం పార్టీ నేతలు మళ్లీ కసరత్తు ప్రారంభించారు, మరో ఇద్దరి పేర్లు చర్చలోకి వచ్చాయి.రాష్ట్ర కేబినెట్లో ఆరు స్థానాలు ఖాళీగా ఉండగా, సామాజిక, ప్రాంతీయ సమీకరణల ఆధారంగా నలుగురిని ఎంపిక చేసేందుకు గత నెలలో ఢిల్లీ(లో నిర్ణయం జరిగింది. ఉగాది సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్తో సమావేశంలో కూడా విస్తరణ గురించి సూచనలు ఇచ్చారు. కానీ, రాహుల్ గాంధీ కొమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పేరుపై ప్రశ్నలు లేవనెత్తారు. ఇప్పటికే కొమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉండగా, ఆయన సోదరుడికి మరోసారి అవకాశం ఇవ్వడం ఎందుకని రాహుల్ ఆరా తీశారు. అయితే, రాజగోపాల్కు పార్టీలో చేరినప్పుడే మంత్రి పదవి హామీ ఇచ్చామని నేతలు వివరించినప్పటికీ, తుది నిర్ణయం కోసం వేచి చూడాలని రాహుల్ సూచించినట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. సీనియర్ నేత జానారెడ్డి హైకమాండ్కు రాసిన లేఖ సంచలనంగా మారింది. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదని, వాటికి అవకాశం కల్పించాలని ఆయన కోరారు. సామాజికవర్గాల వారీగా కూడా పలువురు నేతలు ఢిల్లీలో లాబీయింగ్ను తీవ్రతరం చేశారు. ఇప్పటివరకు సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, వట్టిక శ్రీహరి, వివేక్ పేర్లు ఖరారైనట్లు ప్రచారం జరిగినా, రాహుల్ అభ్యంతరంతో ఈ జాబితాలో మార్పులు సంభవించే సూచనలు కనిపిస్తున్నాయిసీనియర్లు, సామాజిక అంశాలు, జిల్లాల ప్రాతినిధ్యం వంటి అంశాలు తెరపైకి రావడంతో విస్తరణ జరగడానికి బ్రేక్ పడినట్లయింది.