YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నాదెండ్ల...?

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నాదెండ్ల...?
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి కొత్త అధ్యక్షుడు రానున్నారనే వార్తలు వస్తున్నాయి. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల కమిటీ ఇన్ చార్జిగా కేరళ కాంగ్రెస్ నేత ఉమెన్ చాందీ నియామకం నేపథ్యంలో పీసీసీకి కూడా కొత్త అధ్యక్షుడు నియామకం కానున్నారనే వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం, కాంగ్రెస్ పార్టీ ఏపీలో అధికారం కోల్పోయిన దగ్గర నుంచి రఘువీరారెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. నాలుగేళ్లుగా ఆయనే కొనసాగుతున్నారు. అయితే ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో మార్పు జరగబోతోందని వార్తలు వస్తున్నాయి. ఉమెన్ చాందీ ఆధ్వర్యంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో కొంతమంది నేతలు మాట్లాడుతూ.. రఘువీరను మార్చాలనే అభిప్రాయాలను వ్యక్తం చేసినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో మార్పు ఖాయమని అంటున్నారు కాంగ్రెస్ నేతలు కొందరు. రఘువీర స్థానంలో మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు అవకాశం దొరకవచ్చు అని సమాచారం. ఈ మేరకు ప్రచారం అయితే సాగుతోంది. అయితే దీనికి అధికారిక ధ్రువీకరణ లేదు. 

Related Posts