YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అంతరాయం

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అంతరాయం

సికింద్రాబాద్, ఏప్రిల్ 11, 
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో త్వరలో జరగనున్న భారీ పునర్నిర్మాణ పనుల దృష్ట్యా.. ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలగనుంది. స్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి చేసే క్రమంలో భాగంగా.. భారీ స్కై కాంకోర్స్, ఆధునిక లిఫ్టులు, ఎస్కలేటర్లు, కొత్త ఫుట్‌ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ కీలకమైన పనుల కోసం ఏకంగా 115 రోజుల పాటు స్టేషన్‌లోని సగం ప్లాట్‌ఫామ్స్‌ను దశలవారీగా మూసివేయనున్నారు.ఈ నెల 15వ తేదీ నుండి ప్రారంభమయ్యే ఈ మూసివేత కారణంగా సుమారు 120 జతల రైళ్ల రాకపోకల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. వీటిలో ఎక్కువ శాతం రైళ్లు సికింద్రాబాద్‌కు బదులుగా చర్లపల్లి టెర్మినల్ నుండి రాకపోకలు సాగిస్తాయి. మరికొన్ని రైళ్లు నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుండి నడుస్తాయి.ఈ పునర్నిర్మాణ ప్రాజెక్టులో స్కై కాంకోర్స్ నిర్మాణం అత్యంత కీలకమైనది. ఇది దాదాపు 110 మీటర్ల వెడల్పు మరియు 120 మీటర్ల పొడవుతో రెండు అంతస్తుల్లో నిర్మించబడుతుంది. ప్రయాణికులకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఇక్కడే అందుబాటులో ఉంటాయి. విశాలమైన వేచి ఉండే ప్రాంతాలతో పాటు.. అనేక రిటైల్ ఔట్‌లెట్లు, రెస్టారెంట్లు మరియు కియోస్క్‌లు కూడా ఏర్పాటు చేయబడతాయి. ఈ స్కై కాంకోర్స్ లిఫ్టులు, ఎస్కలేటర్లు , ఫుట్‌ఓవర్ బ్రిడ్జిల ద్వారా అన్ని ప్లాట్‌ఫామ్‌లకు అనుసంధానం చేయబడుతుంది.ఈ భారీ నిర్మాణం కోసం పునాదులు , పిల్లర్ల పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ పనుల కోసం ప్లాట్‌ఫామ్ నంబర్లు 2, 3, అలాగే 4 , 5లను విడతల వారీగా 50 రోజుల చొప్పున మొత్తం 100 రోజుల పాటు మూసివేయనున్నారు. ఈ సమయంలో ఈ ప్లాట్‌ఫామ్‌లపై లిఫ్టులు , ఎస్కలేటర్ల ఏర్పాటు పనులు కూడా జరుగుతాయి. అంతేకాకుండా.. ప్లాట్‌ఫామ్‌లతో పాటు రైల్వే ట్రాక్‌ మొత్తానికి పైకప్పు నిర్మించే పనులు కూడా ఈ నాలుగు ప్లాట్‌ఫామ్‌ల వద్ద నుంచే ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ప్లాట్‌ఫామ్ నంబర్ 10 వైపు పనులు చేపడతారు.మరోవైపు.. ప్లాట్‌ఫామ్ నంబర్ 1 నుండి 10 వరకు ఒక భారీ ఫుట్‌ఓవర్ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన భారీ క్రేన్‌ను ప్లాట్‌ఫామ్ నంబర్లు 5 మరియు 6 మధ్యలో ఏర్పాటు చేస్తున్నారు. 500 టన్నుల సామర్థ్యం కలిగిన ఈ క్రేన్‌ను ఏర్పాటు చేయడానికి ఈ రెండు ట్రాక్‌లపై ఇసుక బస్తాలు నింపి ఒక ప్రత్యేకమైన వేదికను తయారు చేస్తున్నారు. ఈ కారణంగా ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లను కూడా 15 రోజుల పాటు మూసివేయనున్నారు. మొత్తంగా.. పునర్నిర్మాణ పనుల కారణంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని ఆరు ముఖ్యమైన ప్లాట్‌ఫామ్స్‌ను మూసివేయనున్నారు.నిత్యం 250 జతల రైళ్లు రాకపోకలు సాగించే ఈ స్టేషన్‌లో ఇప్పటికే 6 జతల రైళ్లను శాశ్వతంగా చర్లపల్లి టెర్మినల్‌కు మళ్లించారు. ఇప్పుడు మరో 120 జతల రైళ్లను తాత్కాలికంగా ఇతర స్టేషన్‌ల ద్వారా నడపనున్నారు. ఈ మార్పుల వల్ల సికింద్రాబాద్‌లో రైలు సేవలు రానున్న ఆరు నెలల పాటు పరిమితంగానే అందుబాటులో ఉండనున్నాయి. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాలను తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Related Posts