
హైదరాబాద్
పోలీసుల కాల్పుల్లో హతమయిన గ్యాంగ్ స్టర్ నయీం కేసులో ఈడీ దూకుడు పెంచింది. నయీంకు సంబంధించి 35 ఆస్తులు జప్తు చేసేందుకు ఈడీ చర్యలు తీసుకుంటోంది. 35 ఆస్తులను నయీం కుటుంబ సభ్యులు, సన్నిహితుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసినట్లు ఈడీ గుర్తించింది. అక్రమంగా ఈ ఆస్తులను నయీం, తమ కుటుంబ సభ్యుల పేర్ల మీద రిజిస్టర్ చేసినట్లు ఈడీ నిర్దారించింది. 2022 మార్చిలో నయీం ఆస్తుల పై ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. నాటి ఐటీ అధికారులు, సిట్ సమాచారంతో ఈసీఐఆర్ నమోదు చేసింది. దాంతో లో నయీం కుటుంబ సభ్యుల పేర్లను చేర్చించింది. భువనగిరిలోని క్రిస్టియన్ గోస్పెల్ మిషన్ సెక్రటరీ ప్రభాకర్ . నయీం పై ఫిర్యాదు చేసారు.