YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

జపాన్ తెలుగు సమాఖ్య నిర్వహించిన కార్యక్రమంలో పాల్గోన్న సీఎం రేవంత్ రెడ్డి

జపాన్ తెలుగు సమాఖ్య నిర్వహించిన కార్యక్రమంలో పాల్గోన్న సీఎం రేవంత్ రెడ్డి

టోక్యో
తెలంగాణలో ఐటీ ఫార్మా రంగంలో సాధించాల్సినంత ప్రగతి సాధించాం. తెలంగాణలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేసుకోబోతున్నాం.. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జపాన్ తెలుగు సమాఖ్య నిర్వహించిన కార్యక్రమంలో అయన మాట్లాడారు. టోక్యోలో అభివృద్ధి చేసిన రివర్ ఫ్రంట్ పరిశీలించాం.  నీరు మన సంస్కృతికి, అభివృద్ధికి ప్రతీక. మూసీ నది ప్రక్షాళనకు కొంతమంది అడ్డు పడుతున్నారు.  ఢిల్లీలో కాలుష్యంతో అన్ని సంస్థలకు సెలవులు ఇస్తున్న పరిస్థితి ఉంది. కేవలం కాలుష్యంతో ఢిల్లీ నగరం స్థంభించే పరిస్థితి ఉంటే.. మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం లేదా అని అన్నారు. అందుకే హైదరాబాద్ లో మూసీ ప్రక్షాళన చేయాలని నేను చెబుతున్నా. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్స్ తెలంగాణ పురోగతికి అత్యంత కీలకమైన అంశాలు. తెలంగాణలో పెట్టుబడులు పెరగాలి,  పరిశ్రమలు పెరగాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచాలనేదే ప్రభుత్వ ఉద్దేశం. తెలంగాణ అభివృద్ధిలో మీ అందరి సహకారం అవసరం. ఎవరికి చేతనైనంత వారు చేయగలిగింది చేస్తే, ప్రపంచంతోనే మనం పోటీ పడొచ్చు. మీ ఆలోచనలను రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోండి. సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ఉన్న ఆనందం ఏమిటో మీకు తెలుసని అన్నారు.

Related Posts