
హైదరాబాద్, ఏప్రిల్ 29,
తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదలకు రంగం సిద్ధమైంది. ఒకటి రెండు రోజుల్లోనే రోజుల్లోనే రిజల్ట్స్ను విద్యాశాఖ ప్రకటించనున్నట్లు సమాచారం. విడుదల తేదీని ఖరారు చేయాలని కోరుతూ పరీక్షల విభాగం ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది. CM రేవంత్ రెడ్డి ఆమోదం లభించగానే ఫలితాలను విడుదల చేస్తారు. త్వరలో అధికారికంగా ఫలితాల విడుదల తేదీ ఖరారు కానుంది. అనంతరం వెంటనే తెలంగాణ ట్రిపుల్ఐటీ నోటిఫికేషన్ 2025 విడుదల కానుంది. 10వ తరగతిలో మంచి మార్కులతో పాసైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజల్ట్స్ చెక్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదే.పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఎస్ఎస్సీ బోర్డు అధికారిక వెబ్సైట్ https://bse.telangana.gov.in/ ద్వారా తమ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. అంతే కాకుండా https://www.manabadi.co.in/ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. విద్యార్థి దశలో 10వ తరగతి పరీక్షలు భవిష్యత్తుకు ఎంత కీలకమైనవో మనందరికీ తెలిసిందే. కెరీర్కు పునాదులు వేసుకునే క్రమంలో పదో తరగతి అనేది ఎంతో కీలకమైంది. అందుకే విద్యార్థులు, తల్లిదండ్రులు టెన్త్ పబ్లిక్ పరీక్షలంటే ఎంతో శ్రద్ధ చూపెడతారు.ఫలితాల అనంతరం విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు.. అందుకే.. పదో తరగతి ఫలితాలపై ఎప్పుడూ ఉత్కంఠ ఉంటూనే ఉంటుంది. ఈక్రమంలో తెలంగాణ పదో తరగతి ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయా అని విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫలితాలు విడుదల తర్వాత ఇంటర్మీడియట్, ట్రిపుల్ ఐటీ, డిప్లొమా తదితర కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్ణయం తీసుకుంటారు.తెలంగాణలో మార్చి 21వ తేదీన ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 2 తో ముగిశాయి. మొత్తం 2,650 కేంద్రాల్లో రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు టీఎస్ ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షలు రాసినట్లు సమాచారం. పలు ప్రాంతాల్లో క్వశ్చన్ పేపర్ లీకేజీ ఘటనలు మినహా పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో.. తెలంగాణ ఎస్స్సీ బోర్డు ముూల్యాంకనం నిర్వహించి ఆ ప్రక్రియను సైతం విజయవంతంగా ముగించింది.10th పరీక్షలను నిర్వహించిన ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ ఏప్రిల్ 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 19 శిబిరాల్లో సమాధాన పత్రాల స్పాట్ మూల్యాంకనాన్ని నిర్వహించింది. అనంతరం మరోసారి ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా రీచెక్ చేసి ఫలితాలు కంప్యూటరీకరణ ప్రక్రియ సైతం పూర్తి చేశారు. అయితే.. ప్రభుత్వ అనుమతి రాగానే టీఎస్ ఎస్ఎస్సీ ఫలితాలు విడుదల చేయనున్నట్లు సమాచారం.