తిరుమల శ్రీవారి ఆలయం దేశానికే తలమానికం అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. రాత్రి తిరుమలకి వచ్చిన ఆయన ఇవాల స్వామకిి జరిగే అభిషేకం సేవలో ఆలయంలో కి వెల్లి స్వామిని దర్శించుకుని మ్రొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏడాది జూన్లో శ్రీవారిని దర్శించుకుంటున్నట్లు తెలిపారు. తిరుమలలో ఉన్న ఏర్పాట్లు మరెక్కడా లేవని అన్నారు. తిరుమలలో పరిశుభ్రతను చూస్తే ఆశ్చర్యం కలుగుతోందని కేంద్రమంత్రి పీయూష్గోయల్ తెలిపారు. స్వామి వారి ఆస్సీస్సులతో దేశ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్టు తెలిపారు.