YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

కమలం కుట్రల్ని జనాల్లోకి తీసుకెళ్తాం

 కమలం కుట్రల్ని జనాల్లోకి తీసుకెళ్తాం
బీజేపీ చేస్తున్న కుట్ర రాజకీయాల్ని ప్రజల్లోకి తీసుకెళతామంటున్నారు చంద్రబాబు. అమరావతిలోని ప్రజా దర్భార్ హాల్‌లో టీడీపీ ఎంపీలతో సమావేశమై.. తాజా పరిణామాలపై చర్చించారు. ఈ భేటీలో ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం భవిష్యత్‌లో చేపట్టబోయే కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేశారు. 'పొత్తుతో సాధించలేదు.. పోరాటంతో సాధిద్దాం. మనకు ప్రతి నిమిషం చాలా ముఖ్యం.. అప్రమత్తంగా ఉంటూ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉద్యమించాలి. విభజన చట్టంలోని హామీలు నెరవేచ్చాల్సిందే' అన్నారు బాబు. 
పోలవరానికి నిధులు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు.. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధుల్ని కూడా వెనక్కు తీసుకున్నారు. అమరావతి విషయంలోనూ మోసం చేశారు. వీటిపై నిలదీయాలి అని సూచించారు. కడప ఉక్కు పరిశ్రమ సాధన కోసం ఎంపీ సీఎం రమేష్ చేపట్టే దీక్షను విజయవంతం చేయాలి. ఎంపీలు కడప వెళ్లి సంఘీభావం తెలపాలి. విశాఖ రైల్వే జోన్‌‌పై కూడా ఉద్యమిద్దాం. రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని వివరిస్తూ.. ఎంపీలు వారానికి ఓ కార్యక్రమాన్ని అన్నిజిల్లాలలో చేపట్టాలని' చంద్రబాబు సూచించారు. ఢిల్లీలో వైసీపీ ఎమ్మెల్యే బీజేపీ నేతల్ని కలిసిన అంశం కూడా చర్చకు వచ్చిందట. దీనిపై కూడా బాబు స్పందించారు. 'ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమావేశం కావడం కుట్ర కాదా. ఇది వైసీపీ, బీజేపీ కుట్రలకు పరాకాష్ట. గతంలోనే సీఎంవోలో విజయ్‌సాయిరెడ్డి ప్రత్యక్షమయ్యారు. కొన్ని ఫోటోలు కూడా బయటికొచ్చాయి. ఇప్పుడు బుగ్గన బీజేపీ నేతల్ని కలవడంపై వీడియోలు కూడా వచ్చాయి. వైసీపీ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా అడగకుండానే వైసీపీకి మద్దతు పలకింది కదా' అని చంద్రబాబు గుర్తుచేశారట. 'బీజేపీ, వైసీపీ చేస్తున్న కుట్ర రాజకీయాలను ఎంపీలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇందిరాగాంధీ కూడా ఎన్టీఆర్‌తో పెట్టుకుని చేతులు కాల్చుకున్నారు.. ఇలాంటి కుట్రల్ని ఎదుర్కోవడం టీడీపీకి కొత్తేమీ కాదు. బీజేపీ కుట్రల్ని అదే స్ఫూర్తితో ఎదుర్కొంటాం. రాష్ట్ర ప్రయోజనాలు, 5కోట్ల మంది ప్రజల హక్కులను పరిరక్షించడంకంటే ఏదీ ముఖ్యం కాదు.' అని వ్యాఖ్యానించారు టీడీపీ అధినేత.

Related Posts