హైదరాబాద్ : ఆంధ్రాబ్యాంక్ తమ ఖాతాదారులకు, నగర ప్రజానీకానికి రంజాన్ పండుగ సందర్భంగా రూ.10 , రూ.50 కొత్త నోట్లను పంపిణి చేసింది. మెహిదీపట్నం, మాసాబ్ ట్యాంక్, కార్వాన్, విజయ్ నగర్ కాలనీ, లంగర్ హౌస్, టోలి చౌకి, సంతోష్ నగర్ కాలనీ ఖాతాదారులకు, ప్రజానీకానికి పంపిణి చేసింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రాబ్యాంక్ జోనల్ కార్యాలయ అధికారులు, ఆంధ్రాబ్యాంక్ వివిధ శాఖల మేనేజర్లు పాల్గొన్నారు. ఈ అవకాసాని ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రాబ్యాంక్ తెలియజేసింది.