హైదరాబాద్ : అమీర్ పేట మైత్రీవనం మెట్రో ఇంటర్ చేంజ్ పాయింట్ నుంచి హైటెక్ సిటీ ప్రతి రోజు ఆర్.టి.సి. ప్రత్యేకంగా పది బస్సులు నడుపుతుంది. బస్సులు సరిపోకపోవడంతో ప్రయాణికులు ఫుట్ బోర్డు ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణికులు రద్దీకి అనుగుణంగా మైత్రీవనం నుంచి మరిన్ని సర్వీసులు నడిపించేలా ఆర్.టి.సి. ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. హైటెక్ సిటీ ప్రాంతాలకు వచ్చే ప్రయాణికులు కోసం బస్సుల ట్రిప్పులు పెంచుతున్నట్లు అధికారులు తెలిపారు.
మరో వైపు ప్రస్తుతం నగరంలో పలు ప్రాంతాల నుంచి హైటెక్ సిటీకి ప్రతి రోజు 214 బస్సులు ఆర్.టి.సి. నడుపుతుంది. వీటికి తోడు మరిన్ని సర్వీసులు పెంచేలా ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.