YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రైల్వే జోన్ పై కేంద్రం అదే పాట

రైల్వే జోన్ పై కేంద్రం అదే పాట
విశాఖ రైల్వే జోన్‌పై కేంద్రం మళ్లీ పాత పాటే పాడింది. విశాఖ రైల్వే జోన్‌ ఇవ్వడం ఇష్టం లేదన్నట్టుగా రైల్వే మంత్రి పీయూష్ గోయల్ వింత వ్యాఖ్యలు చేశారు. రైల్వే జోన్ కావాలని అడిగే 
వారు చట్టంలో ఏముందో చూడాలని వ్యాఖ్యానించారు. విభజన చట్టంలో రైల్వే జోన్‌ అంశం పరిశీలించాలని మాత్రమే ఉందని, పరిశీలిస్తూనే ఉన్నామని చెప్పారు. ఇదే విషయాన్ని 
పార్లమెంట్‌లోకూడా చెప్పామని ఆయన సమర్థించుకున్నారు.రైల్వే జోన్‌ కోసం ఏపీ ప్రజలు కొంతకాలంగా పోరాడుతున్నారు. ఒడిషా రాష్ట్రం ఒప్పుకోలేదంటూ మొదట కేంద్రం మెలికపెట్టింది. 
అయితే విశాఖ పరిధి వరకు జోన్ ఇస్తే అభ్యంతరం లేదని ఆ రాష్ట్రం చెప్పింది. ఇందుకు ఏపీ కూడా సమ్మతించింది. అప్పటి నుంచి ఇదిగో ఇస్తున్నాం.. అధిగో అంటూ ఇస్తున్నాం అంటూ 
బీజేపీ నేతలు చెప్పకుంటూ వస్తున్నారు. తాజా పీయూష్ గోయల్ ప్రకటనతో విశాఖ రైల్వే జోన్ ఇవ్వడం కేంద్రానికి ఇష్టం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 

Related Posts