YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

విశాఖలో రైల్వేజోన్‌ను పరిశీలలో ఉంది కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌

విశాఖలో రైల్వేజోన్‌ను పరిశీలలో ఉంది          కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌
ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో కేవలం రైల్వేజన్‌ అంశాన్ని పరిశీలించాలని మాత్రమే ఉందన్నారు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌. ప్రస్తుతం మంత్రిత్వశాఖ పరిధిలోనే ఆ అంశం ఉందని వెల్లడించారు. తాను కూడా ఆ అంశాన్ని ఇప్పటికీ పరిశీలిస్తూనే ఉన్నానన్నారు. రైల్వే శాఖ గత నాలుగేళ్లలో చేపట్టిన పథకాలు తదితర అంశాలపై మాట్లాడేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, ఈ సమావేశంలో విశాఖ రైల్వే జోన్‌ అంశంపై ఆయనను ప్రశ్నించగా.. ఇదే విషయాన్ని గతంలో పార్లమెంట్‌ సమావేశాల్లోనూ చెప్పానని పీయూష్‌ గోయల్‌ గుర్తు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరికగా ఉన్న రైల్వే జోన్‌ అంశంపై ప్రజలు సుదీర్ఘంగా పోరాడుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ అంశంపై ఇదిగో.. అదుగో.. అంటూ కేంద్రం నాన్చివేత ధోరణి అవలంబిస్తోంది. తొలుత ఒడిశా ఒప్పుకోవడం లేదని చెప్పిన కేంద్రం ఇప్పుడు ఈ అంశాన్ని పరిశీలిస్తూనే ఉన్నామని చెప్పడంతో జోన్‌ ఏర్పాటు చేయడం కేంద్ర ప్రభుత్వానికి ఇష్టంలేదనే వాదనలు వినబడుతున్నాయి.

Related Posts