YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

ప్రేమికుల రోజు కానుకగా ఓ పాట..

ప్రేమికుల రోజు కానుకగా ఓ పాట..

ఫిబ్రవరి 13న విడుదల

-  ఈ చిత్రం మార్చి 30న  ప్రేక్షకుల ముందుకు..

రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'రంగస్థలం'. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్‌ యూట్యూబ్‌లో దూసుకుపోతుండగా.. త్వరలో అభిమానులకు మరో కానుకను ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు చెర్రీ. అదేంటంటే 'రంగస్థలం' నుంచి ఓ పాటను ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 13న విడుదల కాబోతుందట.

రామ్ చరణ్, సమంత మధ్య ఈ పాట ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక పల్లెటూరి ప్రేమకథగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు, ఆది పినిశెట్టి, రావు రమేష్, అనసూయ తదితరులు ముఖ్యపాత్రలలో కనిపించనున్నారు. డీజే బ్యూటీ పూజా హెగ్డే ప్రత్యేక గీతంలో మెరవనుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా.. మార్చి 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Posts