YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

బ్యాంకుల‌ను పేద‌ల‌కు చేరువ చేసిన మోదీ- పురంధేశ్వ‌రి

బ్యాంకుల‌ను పేద‌ల‌కు చేరువ చేసిన మోదీ- పురంధేశ్వ‌రి
బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌ను పేద‌ల‌కు చేరువ చేసేందుకే బ్యాంకుల‌ను జాతీయం చేస్తున్న‌ట్లు 1969లో ఇందిరాగాంధీ చెప్పార‌ని, కానీ 2014 త‌ర్వాతే పేద‌ల‌కు జ‌న‌ధ్‌న్ యోజ‌న ప‌థ‌కం కింద దాదాపు 32 కోట్ల మంది పేద‌ల‌కు బ్యాంకు ఖాతాలు తెరిపించిన ఘ‌న‌త మోదీ ప్ర‌భుత్వానికి ద‌క్కుతుంద‌ని బిజెపి మ‌హిళా మోర్చా జాతీయ ఇన్‌ఛార్జ్‌ పురంధేశ్వ‌రి అన్నారు. జ‌న‌ధ‌న్ ప‌థ‌కంతో అనేక మంది మ‌హిళ‌లు ఆర్థికంగా నిల‌దొక్కుకోగ‌లుగుతున్నార‌న్నారు. పార్టీ కార్యాల‌యంలో నిర్వ‌హించిన మ‌హిళా మోర్చా రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌మావేశాల‌కు ఆమె ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌సంగించారు.మోదీ చేప‌ట్టిన వివిధ కార్య‌క్ర‌మాల‌తో అంద‌రూ ప్ర‌యోజ‌నం పొందుతున్నార‌ని, ముఖ్యంగా మ‌హిళ‌లు ఆర్థిక శ‌క్తిగా ఎదిగేందుకు మోదీ తీసుకుంటున్న చ‌ర్య‌లు ఉప‌యోగ‌ప‌డుతున్నాయ‌న్నారు. 

Related Posts