YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మూడో రోజు నిలిచిపోయిన అమర్ నాధ్ యాత్ర

 మూడో రోజు నిలిచిపోయిన అమర్ నాధ్ యాత్ర
వరుసగా మూడో రోజు అమర్ నాధ్ యాత్ర నిలిచిపోయింది. భారీ వర్షాలకు జీలం నది ప్రవహిస్తూ ఉండడంతో... వాతావరణం అనుకూలించడం లేదు.. మరోవైపు భారీ వర్షాలకు పహెల్గామ్ మార్గంలో అనేక చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అమర్‌నాథ్ యాత్రను శనివారం సైతం నిలిపివేశారు.వాతావరణ పరిస్థితులు అనుకూలించిన సమీక్ష నిర్వహించి తిరిగి యాత్ర ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారుజమ్మూ కశ్మీర్‌లో భారీ వర్షాల కారణంగా అమర్‌నాథ్ యాత్రకు మూడో రోజూ అంతరాయం ఏర్పడింది. వాతావరణం అనుకూలించని కారణంగా అమర్‌నాథ్ యాత్రను అధికారులు శనివారం నిలిపివేశారు. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాలకు జీలం నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లాలో సంగం వద్ద నది 21 అడుగులు దాటి ప్రవహించడంతో పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మరోవైపు భారీ వర్షాలకు పహెల్గామ్ మార్గంలో అనేక చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అమర్‌నాథ్ యాత్రను శనివారం సైతం నిలిపివేశారు. ఇలాంటి వాతావరణ పరిస్థితుల కారణంగానే శుక్రవారం కూడా బల్తాల్ మార్గంలో యాత్రను రద్దు చేశారు. అనంతనాగ్‌ జిల్లాలోని కోకెరాంగ్‌లో అత్యధికంగా 64.4 మిల్లీమీటర్లు, ఖాజిగంద్‌లో 58.6 మిల్లీమీటర్లు, శ్రీనగర్‌లో 12.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. శనివారం ఉదయం నుంచి జీలం నదిలో నీటి మట్టం గంట గంటకూ పెరుగుతోందని అధికారులు వెల్లడించారు. ప్రతికూల వాతావరణం వల్ల బల్తాల్, పహెల్గావ్ మార్గాల్లో రహదారులు అనువుగా లేకపోవడంతో శనివారం జరిగే యాత్రను రద్దుచేసినట్టు జమ్మూ పోలీస్ కంట్రోల్ రూమ్ ప్రకటించింది. శుక్రవారం మూడో విడత 2,876 మందితో కూడిన యాత్రికుల బృందం కట్టుదిట్టమైన భద్రత మధ్య జమ్మూలోని భగవతి నగర్ క్యాంప్ నుంచి 90 వాహనాల్లో బయలుదేరింది. అయితే వీరిని పహెల్గావ్ సమీపంలోని చందన్వారీ నుంచి వెనక్కు మళ్లించి టిక్రీ బేస్ క్యాంప్‌‌నకు తరలించారు. ప్రతికూల వాతావరణం, వరదల ముప్పు పొంచి ఉండటంతో ముందు జాగ్రత్తగా యాత్రను నిలిపివేసి, టిక్రీ క్యాంప్‌లో యాత్రికులను ఉంచి వారికి ఆహారం సరఫరా చేస్తున్నారు.  అమర్‌నాథ్‌ యాత్రలోని బేస్‌క్యాంప్‌ పహెల్‌గామ్‌లో 27.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించిన సమీక్ష నిర్వహించి తిరిగి యాత్ర ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. టిక్రీ క్యాంప్‌లో 500 నుంచి 700 మంది భక్తులు ఉన్నారని, వారికి ఆహారం అందజేస్తున్నామని నేషనల్ పాంథర్స్ పార్టీ జమ్మూ కశ్మీర్ అధ్యక్షుడు బల్వంత్ సింగ్ మన్కొటియా అన్నారు. అంతేకాదు వారు ఏమైనా సమస్యలను ఎదుర్కొంటున్నారా అనేది అడిగి తెలుసుకున్నామని పేర్కొన్నారు

Related Posts