YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

మోత్కుపల్లి ఫైర్

మోత్కుపల్లి ఫైర్

ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఈ పార్టీ మాజీ నేత మోత్కుపల్లి నర్సింహులు మరోమారు దుమ్మెత్తి పోశారు. దళితుల ఓట్లు దండుకునేందుకే దళితతేజం కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారని మోత్కుపల్లి ఆరోపించారు. మాల, మాదిగలు చంద్రబాబును నమ్మరంటూ దళితులకు క్షమాపణ చెప్పాకే చంద్రబాబు సమావేశంలో పాల్గొనాలని పట్టుబట్టారు. టీడీపీలో ఉన్నంత కాలం తనను మానసికంగా చంపేశారని దుయ్యబట్టారు. జులై 11న తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటాని ఈ సందర్భంగా తెలిపిన మోత్కుపల్లి, చంద్రబాబును ఓడించాలని శ్రీవారిని మొక్కుకుంటానన్నారు. ముందస్తు ఎన్నికలొస్తే ఆలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెప్పారు.

Related Posts