YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రాజ్ ఠాక్రేతో రజనీ భార్య సమావేశం

రాజ్ ఠాక్రేతో రజనీ భార్య సమావేశం
మహారాష్ట్రకు చెందిన రాజకీయ నేత, మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎమ్ఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రేతో సమావేశం అయ్యారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్. ఈ విషయాన్ని తెలుపుతూ ట్విటర్లో ఫొటోను పోస్టు చేశారు రాజ్ ఠాక్రే. లతా రజనీకాంత్‌, రాజ్ ఠాక్రే...రాజకీయాల గురించి, సినిమాల గురించి, ఇతర సామాజిక విషయాల గురించి మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఒకవైపు రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ నేపథ్యంలో ఈ సమావేశం ఆసక్తిని రేపుతోంది. అయితే మరాఠా రాజకీయ నేతలతో రజనీకాంత్ కుటుంబీకులు సమావేశం కావడం ఇది కొత్త ఏమీ కాదు. ఇది వరకూ రజనీకాంత్ కూడా మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేతలతో సమావేశం అయ్యారు. రాజకీయాల్లోకి వస్తున్న విషయాన్ని ప్రకటించిన అనంతరమే మరాఠా నేతలతో రజనీ సమావేశం జరిగింది. ఇక బాల్ ఠాక్రే సమయం నుంచినే ఠాక్రే కుటుంబీకులతో రజనీకాంత్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. అవి కొనసాగుతున్నందుకు నిదర్శనంగా నిలుస్తోంది రాజ్ ఠాక్రే, లతా రజనీకాంత్‌ల సమావేశం.

Related Posts