YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

ఉదృతమవుతున్న జోన్ ఉద్యమం

ఉదృతమవుతున్న జోన్ ఉద్యమం
విశాఖ కేంధ్రంగా రైల్వే ఉద్యమం ఉదృతమవుతోంది.స్పష్టత లేని రైల్వే జోన్ పై ఆశలు సన్నగిల్లుతున్న వేళ మరోసారి టిడిపి ఎంపీలు గళమెత్తి ఉద్యమించారు.విభజన చట్టంలో ఉన్న అంశాలను అమలు చెయ్యమని కోరుతుంటే కుంటి సాకులు చెప్పి జోన్ లాంటి కీలక అంశాలపై కేంధ్రం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా విశాఖలో టిడిపి ఎంపీలు మూకుమ్మడిగా ఒక్కరోజు దీక్షను చేపట్టారు.రైల్వే స్టేషన్ సమీపంలో చేపట్టిన దీక్షలో టిడిపి ఎంపిలు అవంతి శ్రీనివాస్ , మురళీ మొహన్ , శివప్రసాద్ , మాగంటి బాబు ఇలా ప్రతీ ఒక్కరూ తరలి వచ్చి కేంధ్రంపై గళమెత్తారు.ఏపీకి ఇచ్చిన హామీలపై ఇంతకేత కాలం నిర్లక్షంగా వ్యవహరిస్తారని ప్రశ్నించిన ఎంపిలు వెంటనే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.ఏపీ ప్రజలపై కక్షసాదింపు చర్యలతో కేంధ్ర ప్రభుత్వ తీరును ఆక్షేపించిన నేతలు వెంటనే జోన్ ఇచ్చే వరకూ ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని చెప్పారు.పలు మార్లు మోదీ కోసం వెళ్లినా సరే ఫలితం లేకుండా పోయిందని ఎంపిలు ప్రధాన తీరుపై అసహనం వ్యక్తం చేశారు.ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక రైల్వే జోన్ పై వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.

Related Posts