YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

దేశీయం

బీహార్ లో అరాచకం - మహిళలు, బాలికలపై మృగాళ్ల కిరాతకాలు పెరిగిపోతూనే ఉన్నాయి

బీహార్ లో అరాచకం - మహిళలు, బాలికలపై మృగాళ్ల కిరాతకాలు పెరిగిపోతూనే ఉన్నాయి

తాజాగా బిహార్‌లోని సరన్ జిల్లాలో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పదమూడేళ్ల బాలికపై ఏకంగా 18 మంది ఏడు నెలల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు. అందులో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు కూడా ఉండడం మరీ దారుణం. అఘాయిత్యానికి ఒడిగట్టినవారిలో బాలిక చదువుతున్న ప్రైవేటు స్కూల్‌ ప్రిన్సిపాల్‌, అక్కడే పనిచేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. గత ఏడాది డిసెంబరులో స్కూల్‌ బాత్రూంలో ఉన్న బాలికను బెదిరించి అక్కడే చదువుతున్న ముగ్గురు బాలురు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఘోరాన్నంతా ఫోన్లో చిత్రీకరించారు. ఈ వీడియోలను బయటపెడతామని బ్లాక్‌మెయుల్‌ చేస్తూ తరచూ ఆమెను లోబర్చుకున్నారు. కొన్నాళ్లకు ఆ వీడియోను 12మంది విద్యార్థులకు పంపగా.. వారూ ఆమె బలహీనతను ఆసరాగా చేసుకొని అఘాయిత్యానికి పాల్పడ్డారు ఏడు నెలల సమయంలో తనపై పాఠశాల ప్రిన్సిపాల్, ఇద్దరు ఉపాధ్యాయులు, 15 మంది విద్యార్థులు అఘాయిత్యం చేశారని బాలిక ఎక్మా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. తనను బెదిరించి పలు మార్లు సామూహిక అత్యాచారాలు చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. గత ఏడాది డిసెంబరులో తన తండ్రి జైలుకు వెళ్లినప్పటి నుంచి తనపై ఈ అఘాయిత్యాలు మొదలయ్యాయని చెప్పింది. ఫిర్యాదులో 18 మంది పేర్లను వెల్లడించింది.తన క్లాస్‌మేట్‌ మొదట అత్యాచారం చేసి ఎవ్వరికీ చెప్పొద్దని బెదిరించాడని, ఆ తర్వాత మరో నలుగురైదుగురు విద్యార్థులు అఘాయిత్యం చేశారని చెప్పింది. వాళ్ల తర్వాత పాఠశాల ప్రిన్సిపల్‌, ఉపాధ్యాయులు, పలువురు విద్యార్థులు తనపై అత్యాచారాలు చేస్తూ వచ్చారని తెలిపింది. తన తండ్రి జైల్లో నుంచి విడుదలయ్యే వరకూ ఏడు నెలల పాటు వారి కిరాతకాలు కొనసాగాయని బాలిక ఫిర్యాదులో పేర్కొంది. ఎక్మా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు శుక్రవారం పాఠశాల ప్రిన్సిపల్‌ను, ఓ ఉపాధ్యాయుడిని అరెస్ట్‌ చేశారు. ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Related Posts