YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం

చంద్రబాబుపై సోము నిప్పులు

చంద్రబాబుపై సోము నిప్పులు
కేంద్ర పథకాలు ఏపీ ప్రభుత్వ పెద్దలకు ఉపాధి హామీగా మారిందన్నారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. విజయవాడలో మాట్లాడిన ఆయన ఏపీ సర్కార్, సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ‘రాష్ట్రంలో అభివృద్ధి పనులకు 90 శాతం నిధులు కేంద్రం నుంచి వచ్చినవే. వెంకయ్య నాయుడు కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో.. రాష్ట్రానికి 7 లక్షల ఇళ్లు మంజూరు చేయించారు. ఆ మూడు లక్షల ఇళ్లు అర్భన్ ఏరియాలో నిర్మించలేదు. నీరు, చెట్టు, హౌసింగ్ పథకాల్లో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది’అని ఆరోపించారు సోము. నాలుగేళ్లుగా రాష్ట్రంలో సమర్థవంతంగా అవినీతి పాలన కొనసాగుతోంది. అంతర్గతంగా కొన్ని శక్తులు కూడా ప్రభావం చూపిస్తున్నాయి. సీఎంకు తెలియకుండానే కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయనే అనుమానాలు ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.లక్షా 20వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఈ అప్పుపై ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు సమాధానం చెప్పాలి. ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న డ్యాష్ బోర్డులో 6 లక్షల ప్రజల సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటి మాటేంటని’ప్రశ్నించారు వీర్రాజు. గ్రామాల్లో అభివృద్ధి పనులకు కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి. వాటిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అవీనీతి చేస్తోంది. ఆ నిధుల్ని సక్రమంగా ఉపయోగించుకుంటే.. రాష్ట్రంలోని ప్రాజెక్టులను పూర్తి చేయొచ్చు. రాష్ట్రంలో సీఎం సభలు పెడుతున్నారు.. వాటికి రాకపోతే ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తామని ప్రజలను బెదిరిస్తున్నారు. ఇదేం పద్దతి. రాష్ట్రంలో బీజేపీ బలం పెరుగుతుందనే భయంతోనే టీడీపీ మా పార్టీ నేతలపై దాడులు చేయిస్తున్నారని’ ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్సీ. 

Related Posts