YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్

 ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్
విమాన ప్రయాణికులకు శుభవార్త. ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ''లో ఫేర్ మ్యాడ్ నెస్ ''పేరిట సరికొత్త ఆఫర్ తెరపైకి తెచ్చింది. కేవలం రూ. 999కే విమాన ప్రయాణం అందిస్తోంది. ఈ ఆఫర్ డొమెస్టిక్ విమాన ప్రయాణికులకు మాత్రమే వర్తిస్తుంది. అంత‌ర్జాతీయ ప్ర‌యాణికుల‌కు రూ.3399 మొద‌లుకొని టిక్కెట్ల ధ‌ర‌లు ప్రారంభం అవుతున్నాయి. 
గోవా-హైదారాబాద్ మ‌ధ్య 9 జులై నుంచి జ‌న‌వ‌రి 31,2019 వ‌ర‌కూ చేసే ప్ర‌యాణాల‌కు టిక్క‌ట్ల ధ‌ర‌ల‌ను రూ.1999గా నిర్ణ‌యించింది. జులై 15 వ‌ర‌కూ ఈ ఆఫ‌ర్ అందుబాటులో ఉంటుంది. 'లో ఫేర్ మాడ్ నెస్   స్కీమ్‌లో భాగంగా 2019 ఫిబ్ర‌వ‌రి 1 నుంచి ఆగ‌స్టు 13,2019 మ‌ధ్య ప్ర‌యాణాల‌కు ఫ్లైట్ టిక్కెట్ల‌ను బుక్ చేసుకోవ‌చ్చు. అంతే కాకుండా త్వ‌ర‌లో అమ్రిత్‌స‌ర్-బెంగుళూరు మ‌ధ్య ఎయిర్ ఏసియా డైలీ స‌ర్వీసును ప్రారంభించ‌నుంది. దీనికి సంబంధించి జులై 10 నుంచి జ‌న‌వ‌రి 31,2019 వ‌ర‌కూ టిక్కెట్ ధ‌ర‌ను రూ.4099గాను, ఫిబ్ర‌వ‌రి 1- ఆగ‌స్టు 13,2019 వ‌ర‌కూ టిక్కెట్ ధ‌ర‌ను రూ.4499గా నిర్ణ‌యించింది. 

Related Posts