YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

వోడాఫోన్-ఐడియా మథ్య ఒప్పందం

వోడాఫోన్-ఐడియా మథ్య ఒప్పందం
వొడాఫోన్‌-ఐడియా సెల్యూలార్‌ల విలీనానికి ప్రభుత్వం సోమవారం పచ్చజెండా ఊపింది. దీంతో ఐడియా సంస్థ వొడాఫోన్ విలీనం చేసుకొని అతిపెద్ద టెలికా ఆపరేటరుగా అవతరించనుంది. ఐడియా-వొడాఫోన్‌ల విలీనానికి గాను టెలికాం మంత్రిత్వ శాఖ కొన్ని షరతులతో కూడిన సమ్మతిని అందించిన‌ట్లుగా ఈ వ్య‌వ‌హారంతో సంబంధం ఉన్న‌ వర్గాలు తెలియజేశాయి. వొడాఫోన్‌ స్పెక్ట్రమ్‌కు సంబంధించిన దాదాపు రూ.3926 కొట్ల సొమ్మును నగదు రూపంలో చెల్లిం చాలని.. దీనికి తోడు రూ.3342 కోట్ల సొమ్మును బ్యాంక్‌ గ్యాంరెటీని దాఖలు చేయాలని సూచిస్తూ టెలికాం శాఖ విలీనానికి సమ్మతి తెలిపినట్టుగా సమాచారం. వొడాఫోన్‌-ఐడియాల విలీనంతో ఏర్పడే సంస్థ దాదాపు రూ.1,50,000 కోట్ల విలువతో ఇక దేశంలోనే అతిపెద్ద టెలికాం సర్వీస్‌ ప్రొవై డర్‌గా అవతరించనుందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ రెండు సంస్థలకు కలిపి దాదాపు 35 శాతం మార్కెట్‌ వా టా ఉంది. రెండు సంస్థల టెలికాం వినియోగదారుల సంఖ్య దాదాపు 43 కోట్ల మందికి పైమాటే. విలీన సంస్థ‌కు దేశంలో అన్ని స‌ర్కిళ్ల‌లో నెట్‌వ‌ర్క్ ఉన్న‌ట్లు అవుతుంది. రిలయన్స్‌ జియో రాకతో వ్యాపారం తగ్గి పీకల్లోతు రుణాలతో ఆర్థిక సమస్యలలో కూరుకుపోయిన ఐడియా, వొడాఫోన్‌ సంస్థలకు సర్కారు నిర్ణయం గొప్ప ఊరటను కలిగించింది. ఈ రెండు సంస్థలకు కలిపి దాదాపు రూ.1.15 లక్షల కోట్ల మేర రుణభారం ఉంది. 

Related Posts