YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

కళ్యాణ్ జ్యూయలరీస్ యాడ్ కు చెక్

కళ్యాణ్ జ్యూయలరీస్ యాడ్ కు చెక్
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కూతరు శ్వేతా నందాతో కలిసి కేరళకు చెందిన ఒక ప్రముఖ బంగారు ఆభరణాల కంపెనీ ప్రకటనన రూపొందించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనలోనూ వీరిద్దరూ తండ్రీ కూతుళ్లుగా నటించారు. ఆ సంస్థ ఆభరణాలు, నగలపై ఉన్న నమ్మకాన్ని ప్రజలకు తెలియజేయడమే ఆ ప్రకటన ముఖ్య ఉద్దేశం. 1.5 నిమిషాల ప్రకటనపై దేశవ్యాప్తంగా బ్యాంకర్ల నుంచి నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల్లో అపనమ్మకం, చెడు అభిప్రాయం కలిగే ఆ యాడ్ ఉందని పేర్కొంటున్నాయి. కల్యాణ్ జువెల్లర్స్ ఆ ప్రకటనను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. బ్యాంకింగ్ వ్యవస్థతో పాటు కొంతమంది మనోభావాలు దెబ్బతీసేలా ఆ ప్రకటన ఉందని గ్రహించాం. అన్ని మాద్యమాల నుంచి తక్షణమే ఆ ప్రకటనను నిలిపివేస్తున్నామని కల్యాణ్ జువెల్లర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేశ్ తెలిపారు. కేవలం అది ప్రచార చిత్రం మాత్రమేనని సంస్థ ప్ర‌తినిధులు వెల్ల‌డించారు. తెలుగు ప్రసార మాధ్యమాల్లో ప్ర‌సారం అవుతున్న యాడ్‌లో టాలీవుడ్ సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున ఈ ప్రకటనలో నటించారు. నమ్మకానికి పెట్టింది పేరు కల్యాణ్ జువెల్లర్స్ అంటూ యాడ్ ముగిసిపోతుంది.

Related Posts