YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ప్రధాని హామీలకు దిక్కు లేదా రాజ్యసభలో ప్రత్యేక హోదాపై వాడివేడీ చర్చ

 ప్రధాని హామీలకు దిక్కు లేదా రాజ్యసభలో ప్రత్యేక హోదాపై వాడివేడీ చర్చ
రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి మండిపడ్డారు. విభజన హామీలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. రాజ్యసభలో సాక్షాత్తు ప్రధానమంత్రి ఇచ్చిన హామీలు, చట్టాలు కూడా ఎందుకు అమలుకావడం లేదని ప్రశ్నించారు. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను, తీర్మానాలను కూడా కేంద్ర ప్రభుత్వం పక్కనపెడుతోందని విమర్శించారు. విభజన హామీల విషయంలో ఏపీకి తీరని అన్యాయం జరిగిందని అన్నారు.ఏపీని ఎన్డీఏ ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందన్నారు కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ ఎంపీ సుజనా చౌదరి. రాజ్యసభలో ఏపీ సమస్యలు, విభజన చట్టంపై జరిగిన స్వల్పకాలిక చర్చను ఆయన ప్రారంభించారు. ‘ఏపీకి హోదా ఇస్తామని 2014లో ఎన్నికల ముందు ప్రకటించారు. గుంటూరు, నెల్లూరు, తిరుపతిలో జరిగిన సభల్లో స్వయంగా మోదీనే ప్రకటించారని గుర్తు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లైనా వాటిని పట్టించుకోవడం లేదు. కేంద్రమంత్రి వర్గ నిర్ణయాలను కూడా తుంగలో తొక్కారు. హామీలపై ఎన్నోసార్లు అడిగాన ప్రధాని కార్యాలయం కనీసం పట్టించుకోకపోవడం దారుణమన్నారు’ సుజనా. కేంద్రం సహకార ఫెడరలిజానికి విరుద్ధంగా పనిచేస్తోందని. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటూ మా సహచరులంతా ఢిల్లీ చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. కేంద్రం పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తోందని... అలాగే వెనుకబడిన జిల్లాలకు అందించే సాయంలో కూడా అన్యాయం చేసింది. ఏపీని కేంద్రం దారుణంగా మోసం చేసిందని మండిపడ్డారు. ఇక నాలుగేళ్లైనా విశాఖ రైల్వే జోన్ గురించి ప్రస్తావనే లేదు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఏపీ అంధకారంలో ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుతో ఏపీ ప్రజల భవితవ్యం అంధకారంలో పడిందని సుజనా చౌదరి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని ఏపీ ప్రజలు గత నాలుగేళ్లుగా ఎదురు చూశారని, ఇప్పుడు నమ్మకం కోల్పోయారని అన్నారు. దేశంలో చోటు చేసుకుంటున్న మూక దాడుల తరహాలోనే ఏపీపై కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తోందని ఆరోపించారు. సహకార స్పూర్తికి విఘాతం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు.లోక్ సభలో మోదీ మాట్లాడుతూ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని చెప్పారని... యూటర్న్ తీసుకున్నది కేంద్ర ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. రూ. 16 వేల కోట్ల లోటుతో రాష్ట్రం విడిపోతే... కేంద్ర ప్రభుత్వం రూ. 4 వేల కోట్లు మాత్రమేనని చెబుతోందని మండిపడ్డారు. లోటు ఎంతనేది ఈ సభలోనే తేల్చాలని డిమాండ్ చేశారు.14వ ఆర్థిక సంఘాన్ని సాకుగా చూపుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం చెబుతోందని సుజనా విమర్శించారు. ఏపీ ప్రజలను కాపాడాలని ప్రధాని మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని చెప్పారు. ఏపీని కాపాడాలని, ఏపీని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాలని అన్నారు. పార్లమెంటులో ప్రధాని ఇచ్చిన అన్ని హామీలను నెరవర్చాలని కోరారు. మాకు న్యాయంగా రావాల్సినవి మాత్రమే ఇవ్వాలని కోరుతున్నామని, తము ఏదీ అడుక్కోవడం లేదంటూ ప్రసంగాన్ని ముగించారు.

Related Posts