YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కరుణానిధిని పరామర్శించిన బాబు

 కరుణానిధిని పరామర్శించిన బాబు
కావేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే అధినేత కరుణానిధిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. శనివారం ఉదయం చెన్నై చేరుకున్న సీఎం చంద్రబాబు నేరుగా కావేరీ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధిని పరామర్శించి, ఆయన ఆరోగ్య సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. కరుణానిధి కుమారుడు స్టాలిన్, కూతురు కనిమొళి చంద్రబాబుతో కాసేపు భేటీ అయ్యారు. వారి సమక్షంలోనే కరుణానిధి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు చంద్రబాబుకు వివరించారు. సీఎం చంద్రబాబు వెంట మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, సీనియర్ నేత వీరమస్తాన్‌రావు ఉన్నారు.తీవ్ర అస్వస్థతతో జులై 27న కావేరీ ఆస్పత్రిలో చేరిన కరుణానిధి క్రమంగా కోలుకుంటున్నారు. రెండు రోజుల నుంచి అరగంట పాటు కుర్చీలో కూర్చోబెట్టి కరుణానిధికి ప్రత్యేక ఫిజియోథెరపీని వైద్యులు అందజేస్తున్నారు. కరుణానిధి పూర్తిగా కోలుకుంటున్నారని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు వైద్యులు బులిటెన్‌ను విడుదల చేశారు.

Related Posts