YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

డిజిటల్‌ చెల్లింపులపై జిఎస్‌టి ప్రోత్సాహం.. రూ.100 వరకు క్యాష్‌బ్యాక్‌ సదుపాయం..!!

డిజిటల్‌ చెల్లింపులపై జిఎస్‌టి ప్రోత్సాహం.. రూ.100 వరకు క్యాష్‌బ్యాక్‌ సదుపాయం..!!

న్యూఢిల్లీ: డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ప్రయోగాత్మకంగా ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని జిఎస్‌టి మండలి సమావేశం నిర్ణయించింది. శనివారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ చెప్పారు. ఇందులో భాగంగా భీమ్‌ యాప్‌, యుపిఐ, రూపే కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తే, ఆ లావాదేవీపై చెల్లించాల్సిన జిఎస్‌టిలో రూ.100కు మించకుండా 20 శాతం వరకు వినియోగదారులకు క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. ‘ఇందుకోసం ఒక ప్రయోగాత్మక ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించాం. ఈ విధానంలో రూపే కార్డు, భీమ్‌, యుపిఐ, ఆధార్‌ ద్వారా వినియోగదారులు చేసే చెల్లింపులపై వ్యాపార సంస్థలు చెల్లించే జిఎస్‌టిలో 20 శాతానికి రూ.100 పరిమితికి లోబడి వినియోగదారులకు క్యాష్‌బాక్‌ రూపంలో లభిస్తుంది

Related Posts