YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కేసీఆర్ మద్దతు కోరిన నితీష్ కుమార్

కేసీఆర్ మద్దతు కోరిన నితీష్ కుమార్
ఈ నెల 9న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో, మద్దతు కూడగట్టుకునే పనిలో అన్నిపార్టీల అధినేతలు నిమగ్నమయ్యారు. అయితే రాజ్యసభలో ఏ పార్టీకి, ఏ కూటమికీ స్పష్టమైన మెజారిటీ లేదు. ప్రధాన పక్షమైన బీజేపీ ఈ పదవిని తమ మిత్రపక్షమైన జేడీయూకి ఇవ్వాలని భావిస్తోంది.
ఈ నేపథ్యంలో, తమ రాజ్యసభ సభ్యుడు హరివంశ్ నారాయణ్ సింగ్ ను జేడీయూ అధినేత నితీష్ కుమార్ బరిలోకి దింపుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నితీష్ కుమార్ ఫోన్ చేశారు. తమ అభ్యర్థికి మద్దతివ్వాలని కోరారు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా నితీష్ కు కేసీఆర్ చెప్పారు. ఈరోజు సాయంత్రంలోగా కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా కురియన్ పదవీకాలం ముగియడంతో... జూలై 1 నుంచి ఆ పదవి ఖాళీగా ఉంది. కాంగ్రెస్, టీఎంసీలు కూడా ఈ పదవిని కోరుకుంటున్నాయి.

Related Posts