రాజధానిలో 108 అడుగుల ఎత్తయిన ఎన్టీఆర్ విగ్రహాన్ని నీరుకొండ వద్ద ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన నాలుగు ఆకృతులను ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పరిశీలించారు.
వాటికి మరింత మెరుగులు దిద్ది వచ్చే మంత్రివర్గం నాటికి ఆకృతులు సిద్ధం చేయాలని ఆదేశించారు. తొలుత కృష్ణా నది ఒడ్డున కోర్ క్యాపిటల్కు అభిముఖంగా ఏర్పాటు చేయాలనుకున్నారు. తాజాగా ఆ ప్రాంతాన్ని మార్చి నీరుకొండ కొండపైన రాజధాని వైపు చూసేలా ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని తీర్మానించారు.
విగ్రహం ఎదుట భారీ జలాశయం ఉంటుంది. ఈ కొండపైనే ఎన్టీఆర్ స్మారక కేంద్రం, కన్వెన్షన్ కేంద్రాలు, గ్రంథాలయం, ఎన్టీఆర్ జీవిత విశేషాలతో కూడిన ప్రదర్శనశాల ఉంటాయి.