YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

ఆంధ్రాబ్యాంకుకు రూ.2,019 కోట్ల మూలధనం సమకూర్చనున్న కేంద్ర ప్రభుత్వం.

 ఆంధ్రాబ్యాంకుకు రూ.2,019 కోట్ల మూలధనం సమకూర్చనున్న కేంద్ర ప్రభుత్వం.

ఆంధ్ర బ్యాంకుకు కేంద్ర ప్రభుత్వం రూ.2,019 కోట్ల మూలధన నిధులు సమకూర్చనుంది. దీనికి బదులుగా ఆంధ్ర బ్యాంకు కేంద్ర ప్రభుత్వానికి ఈక్విటీ షేర్లు జారీ చేసింది. రూ. 2,019 కోట్ల విలువకు 'ప్రిఫెరెన్సిల్  అలాట్మెంట్ ' పద్ధతిలో కేంద్ర ప్రభుత్వానికి షేర్లు కేటాయించాలని శుక్రవారం ఆంధ్రాబ్యాంకు డైరెక్టర్ల బోర్డు సమావేశంలో నిర్ణయించారు. ఇదేకాకుండా రూ.10 కోట్లకు ఆంధ్రాబ్యాంక్ ఉద్యోగుల షేర్లు కొనుగోలు పథకం కింద షేర్లు కేటాయించాలని ప్రతిపాదించారు.

     మరో వైపు ఆంధ్రాబ్యాంకు ఇంకా నష్ఠాల బాటలోనే కొనసాగుతుంది. ఈ ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.539.83 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. క్రితం, ఆర్ధిక సంవత్సరం ఇదేకాలంలో రూ. 40.42 కోట్ల నికర లాభం ఉండటం గమన్హారం.

Related Posts