సూర్య యాడ్స్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ కొలచలమ సూర్య నారాయణ మూర్తి తండ్రి కొలచలమ అనంత పద్మనాభ యజ్ఞ నారాయణ దీక్షితు(93)లు అకాల మరణం చెందారు. శనివారం ఉదయం 5 .15 గంటలకు తుదిశ్వాస విడిచారు. గుంటూరులో నివసిస్తున్న దీక్షితులు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మెరుగైన వైద్య సేవల నిమిత్తం శుక్రవారం రాత్రి హైదరాబాద్ బేగంపేట లోని తన కొడుకు సూర్య నారాయణ మూర్తి ఇంటికి వచ్చారు. ఆ మరునాడు ఉదయమే దీక్షుతులు పరమపదించారు. ఈ హఠాత్ పరిణామంతో దీక్షితులు కుటుంబ సభ్యులు యావత్తు దిగ్ర్భాంతికి లోనయ్యారు. దీక్షితులు మరణ వార్త విన్న వెంటనే అయన కుటుంబ సభ్యులు హుటాహుటీన హైదరాబాద్ చేరుకున్నారు.
పితృ వియోగం చెందిన సూర్య నారాయణ మూర్తి బంధుగణంతో పాటుగా అయన మిత్రులు, శ్రేయేభిలాషులు పెద్ద ఎత్తున తరివాచారు. కష్ట కాలంలో ఉన్న మిత్రునికి అండగా నిలిచి దైర్యం చెప్పారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ జ్వాలా నరసింహ రావు తదితరులు దీక్షితులు పార్మాదేవ దేహానికి నివాళుల్పించారు. సూర్య నారాయణ మూర్తి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియచేసారు.అదే విధంగా పలువురు అధికారులులు, అనధికారులులు తమ సంతాపం తెలిపారు.