YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అంబానీకి దోచిపెట్టారు

 అంబానీకి దోచిపెట్టారు
అనంతపురం, ఆగస్టు 13, (న్యూస్ పల్స్)
2019 ఎన్నికలో అవినీతి సొమ్ముతో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు ఏపీసీసీ ఛీఫ్ రఘువీరా రెడ్డి.  అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో అయన మీడియాతో మాట్లాడారు. రాఫెల్ యుధ్ధవిమానాల ఒప్పందంలో గతంలో కాంగ్రేస్ ప్రభుత్వం 500 కోట్లకూపాయలతో  ఒక్కోవిమానాన్నికొంటే ఇపుడు బీజేపీ ప్రభుత్వం 1600 కోట్ల రూపాయలతో ఒక్కో విమానాన్ని కొనుగోలుచేసి 41వేలకోట్ల రూపాయల అవినీతిసొమ్మును అంబానీకి దోచిపెట్టేందుకు బీజేపీ చేస్తోందని ద్వజమెత్తారు.  
కేరళలో రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యంతో ప్రాణనష్టం ఆస్తినష్టం జరిగితే 100 కోట్లరూపాయలతో పరిహారంతో ప్రజలను అవహేళన చేసిందన్నారు. బీజేపీ యేతర రాష్ట్రలను చిన్నచూపుచూడటం వారికి అలవాటుగా మారిందని రఘువీరారెడ్డి మండిపడ్డారు

Related Posts