YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు

నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు
శుక్రవారం మార్కెట్లకు కలిసిరాలేదు. ఉదయం ఆరంభంలో స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు.. తర్వాత నష్టాల బాటపట్టాయి. ఇక ఏ దశలోనూ కోలుకునే ప్రయత్నం చేయలేదు. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 85 పాయింట్ల నష్టంతో 38,251.8 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా క్రితం రోజుతో పోలిస్తే 25 పాయింట్లు కోల్పోయి 11,557 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 70.07గా ఉంది. బంగారం ధర 47 పాయింట్లు పెరిగి 29,655 వద్ద స్థిరపడింది. 
భెల్, అపోలో, వేదాంత, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ అసెట్ మేనేజ్‌మెంట్ తదితర షేర్లు లాభాలతో ముగిశాయి.

Related Posts